గిరిజనులకు సాగు భూమిపై హక్కు పత్రాలు ఇవ్వాలంటూ సిపిఎం ఆందోళన

రోలుగుంట: గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

- వచ్చే నెల 9న జరిగే ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూ పంపిణీ కార్యక్రమంలో వీరందరికీ పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు.

- విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని గిరిజన గ్రామాలను సందర్శించారు.

- మండలంలోని 16 గ్రామాల్లో గిరిజనులు జీవిస్తున్నారని, వీరంతా ఆయా సమీపంలోని అటవీ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ నేటి వరకు సాగు హక్కు పత్రాలను పంపిణీ చేయలేదని చెప్పారు.

- ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీపీఎం నాయకులు చిరంజీవి, శ్రీనివాసరావు తదితరులు డిమాండ్ చేశారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories