ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కామెంట్స్..

తూర్పుగోదావరి : కాకినాడలో ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కామెంట్స్..

రైతు రుణమాఫీ మీద కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..

కేంద్రప్రభుత్వం 5 శాతం రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం కలిసి సున్నా వడ్డీ ద్వారా రైతు రుణమాఫీ సక్రమంగా అందిస్తున్నాము..

చంద్రబాబు హయాం లో సున్నా వడ్డీ గాలికి వదిలేసి నప్పుడు ఈ పత్రికలు ఏమైపోయాయి..

రైతులు మీద చిన్న చూపు వలన ఎన్నికల్లో ఇచ్చినా హామీలు అమలు చేయలేదు..

చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయారు..

2014-19 వరకు 15000 కోట్ల రూపాయిలు బడ్జెట్ లో ఉంచి 600 కోట్ల మాత్రమే రైతులకు చెల్లించారు..

రైతులను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుది..

చంద్రబాబు హాయం లో మోసపోయినా రైతులను ఆదుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి..

రైతు బరోసా కేంద్రం ద్వారా సున్నా వడ్డీ పధకం రైతులకు అందజేస్తున్నము..

యనమల రామకృష్ణుడుకు తెలిసిన జిమ్మిక్కులు, దొంగ లెక్కలు మాకు తెలియవు..

యనమల లా మసిపూసి మారెడు చెయ్యడం మాకు రాదు..

ఇచ్చిన హామీ సక్రమంగా నెరవేర్చడం తప్పా?

కరిఫ్ నుంచి రబీ వరకు అన్ని పంటలకు విత్తనాలు నుంచి లోన్ల వరకు రైతు బరోనా కేంద్రాలు ద్వారా రైతులకు సకాలంలో అందిస్తున్నాము..

రైతు బరోసా కేంద్రం ద్వారా రైతులకు అన్ని లోన్లు నేరుగా అందిస్తున్నాము..

వారి వివరాలు రైతు బరోసా కేంద్రాల వద్ద ఉంచుతున్నాము..

రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన లోన్లు, పధకం అందకపోయినా 155251 కాల్ సెంటర్ కి కాల్ చేసి పిర్యాదు చేయ్యవచ్చు..

తూర్పుగోదావరి జిల్లా డి.సి.సి బ్యాంకు ద్వారా 83 కోట్ల 70 లక్షలు సున్నా వడ్డీ బకాయిలు విదుదల చెయ్యడం వలన జిల్లా లోని ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటిలు బలోపేతం అయ్యాయి..

రేపటి నుంచి రెవిన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తoగా "ఈ" పంట ద్వారా ఏ గ్రామం లో ఏ పంట వేస్తున్నారో సమచారం సేకరిస్తున్నారు..

ఈ విధానం ద్వారా కౌలు రైతులకు లబ్ది చేరుతుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories