అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

అంబాజీపేట: మండలంలోని మాచవరం గ్రామపంచాయతీ పరిధిలోని కోఠివారి అగ్రహారంలో ఒక వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ఎస్.ఐ షేక్ జానీ బాషా సిబ్బందితో కలిసి మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

- దీనికి సంబంధించి ఎస్.ఐ జానీ బాషా తెలిపిన వివరాల ప్రకారం కోఠివారి అగ్రహారంలో మద్యం విక్రయిస్తున్న వాసంశెట్టి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి, మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. అదుపులో తీసుకున్న వ్యక్తిని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలియజేశారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యాన్ని నిల్వచేయడం, విక్రయించటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారి వివరాలు నా ఫోన్ నెంబర్ 944 0796 563కు తెలియజేయాలని జానీ బాషా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories