క‌రోనాపై అంతిమ విజ‌యం మ‌న‌దే: శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని

చిలకలూరిపేట: క‌రోనాపై అంతిమ విజ‌యం మ‌న‌దేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు.

- క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌పంచం విజ‌యం సాధించాల‌ని, మ‌న దేశం శ‌త్రువులను దీటుగా ఎదుర్కోవాల‌ని ఆకాంక్షిస్తూ స్థానిక ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ఆదివారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

- తొలుత ఎమ్మెల్యే ర‌జినిని ఆల‌య అధికారులు, ధ‌ర్త‌క‌ర్త పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్వామివారికి అభిషేకాలు నిర్వ‌హించారు.

- ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేలా ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన శ‌క్తిని ఇవ్వాల‌ని స్వామి వారిని కోరుకున్న‌ట్లు చెప్పారు.

- మ‌న దేశంపై గెలిచే స‌త్తా ఎవ‌రికీ లేద‌ని, భార‌త‌దేశం ఎప్ప‌టికీ సుర‌క్షితంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

- ఆటుపోట్లు స‌హ‌జంగా వ‌స్తుంటాయ‌ని, వాటిని త‌ట్టుకునేందుకు అంద‌రం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందేన‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌లు, ఈవో ప్ర‌సాద్‌, దేవాదాయ సిబ్బంది ఉన్నారు. 




Show Full Article
Print Article
Next Story
More Stories