టీటీడీ ఈ దర్శన్ కౌంటర్లను తిరిగి పునరుద్ధరించాలి

కడప: నగరంలోని ప్రెస్ క్లబ్ నందు గోవింద మాల గురు స్వామి శివరామి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

- 2004లో రాజశేఖర్ రెడ్డి టీటీడీ ఈ దర్శన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని,నేడు జగన్ మోహన్ రెడ్డి ఈ దర్శన్ కౌంటర్ లను రద్దు చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు.

- ఎన్నికల ప్రచారంలో తండ్రి పెట్టిన మంచి పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారుని, మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిగా ఈ దర్శన్ కౌంటర్లను కొనసాగిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.

- జిల్లాలో 4 ఈ దర్శన్ కౌంటర్ల ఉన్నాయని,ఈ నాలుగు కౌంటర్లను పునరుద్ధరించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూదాలని తెలిపారు.

- అంతేకాకుండా ఈ దర్శన్ కౌంటర్ లో పని చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, కుల, మత, బేధాభిప్రాయాలు లేని మీ పాలనలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఆశిస్తున్నామని తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories