ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కోవిడ్ ఐసీయు వార్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనంతపురం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని కోవిడ్ ఐసియు వార్డును జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.

- అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్యతో కలిసి కోవిడ్ ఐ సి యు వార్డులో కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించడానికి ఏర్పాటుచేసిన లెవెల్ 1,2,3 వార్డులలోని బెడ్ లను పరిశీలించారు.

- ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వ్యాధి తీవ్రతను బట్టి లెవెల్ 1,2,3 వార్డులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

- లెవెల్ 1 నందు ఐ సి యు సౌకర్యంతో తొమ్మిది బెడ్ ను ఏర్పాటు చేశామన్నారు.

- ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, ఇతర వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories