ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్ధలపై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

అనంతపురం: ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్ధలపై విచారణ జరిపించాలని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేసారు.

- బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలతో పాటు పిఎం కేర్స్‌ నిధిపై కూడా విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ శైలజానాథ్‌ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ట్రస్ట్‌లపై ఇడి, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం మోడీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమని తెలిపారు.

- కాంగ్రెస్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు చైనా నుండి నిధులు వచ్చాయంటూ బిజెపి చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

- బిజెపికే చైనా నిధులు వస్తున్నాయని, అందుకే చైనా చొరబాటుపై ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారని విమర్శించారు.

- కరోనా సాకుతో సిబిఎస్‌ఇ సిలబస్‌ తగ్గించడంలో కేంద్రప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories