కోరుకొండ లో మాజీ ఎమ్మెల్యే నిరసన దీక్ష

కోరుకొండ : రాజనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆదివారం కోరుకొండ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.

- అమరావతి రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా 200 రోజులు అయిన సందర్భంగా ఈ దీక్షలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

- అదేవిధంగా తెలుగు దేశం పార్టీ బీసీ నాయకుల అరెస్టులకు నిరసన వ్యక్తం చేశారు.

- బీసీ నాయకులను అరెస్టు ద్వారా వేధించటం అధికార పార్టీ పాల్పడుతుందని అన్నారు.

- ఈ నిరసన కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు మింగి లక్ష్మీనారాయణ, తెలుగం శెట్టి శ్రీను, నాగ రమేష్, దిడ్డి మాధవరావు, కొయ్య సామ్యూల్ పరసా శ్రీను వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. 



Show Full Article
Print Article
Next Story
More Stories