నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు: డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప: సీఎం ఆదేశాల మేరకు ఈరోజు నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా తెలిపారు.

- కడప కార్పొరేషన్‌లో కోవిడ్‌-19పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది.

- ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తోందని, అత్యధికంగా పులివెందుల, ప్రొద్దుటూరు పట్టణాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మాస్కులు లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, మున్సిపల్‌ కమిషనరు లవన్న, డీఎస్పీ సూర్యనారాయణ, తహసీల్దారు శివరామిరెడ్డి పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories