తాతయ్యపల్లిలో బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

గోవిందరావుపేట: మండలం దుంపిల్లగూడెం గ్రామ పంచాయతీలోని తాతయ్యపల్లికి చెందిన 25 నిరపేద కుటుంబాలకు ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.

- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో గత 95 రోజులుగా పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం తమ వంతు సాయం చేయడం జరుగుతుందని, పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

- ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కొంపెళ్ళి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య, పసర సర్పంచ్ ముద్దబోయిన రాము, ఎంపీటీసీ ఏడుకొండలు, ములుగు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బార్ల సమ్మి రెడ్డి, వార్డు సభ్యులు కొర్ర శ్రీనివాస్, చేరుకుల సురేష్, తండా రవి తదితరులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories