నూతన సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ వంగా గీత

జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు.

- జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ను ఆమె ప్రారంభించారు.

- అనంతరం జగ్గంపేటలో నూతనంగా నిర్మించిన కల్వర్టును ప్రారంభించి, తదుపరి గండేపల్లి మండలం ఎన్ టి రాజాపురం, మురారి గ్రామాలలో నూతన సబ్ స్టేషన్ లను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు.

- ఈ సందర్భంగా ఎంపి గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్ రైతులకు వెన్నుదన్నుగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.

- రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories