పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ క్షేత్రంలో భక్తుల దర్శనాలు నిలిపివేత

పిఠాపురం: పట్టణంలో శ్రీ పాద శ్రీ వల్లభ క్షేత్రంలో భక్తుల రక్షణ చర్యలలో భాగంగా భక్తులకు రేపటి నుంచి తాత్కాలికంగా దర్శనములు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- ఆలయం పక్కనే గల వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.

- పిఠాపురం పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

- స్వామి వారి నిత్య పూజాధికములు అర్చకులచే నిర్వహిస్తారన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.



Show Full Article
Print Article
Next Story
More Stories