దర్శనం వేళలు సడలించిన సత్యదేముని దేవస్థానం

HMTV
By HMTV
Published on: 2020-06-25 01:35:30

అన్నవరం: కరోనా కేసులు జిల్లాలో అనూహ్యంగా పెరుగుతున్న పరిస్థితిల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా లోని కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ దరిమిలా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సత్యదేముని ఆలయ దర్శనములకు భక్తుల అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వ్రతాలు నిర్వహించుకొను భక్తులు ఉదయం 6 గంటలనుండి 8 గంటల లోపు ఆలయం వద్దకు రావలెనని, నిత్యకళ్యాణం, ఆయుష్య హోమాలు నిర్వహించుకునే భక్తులు టికెట్లను ఆన్ లైన్ తీసుకొనిన యెడల పరోక్షంగా వారి పేరున చేయబడునట్లు, కేశఖండన చేసుకొనే భక్తులు ఉదయం 10 గంటల లోపు ఆలయంకు రావలెనని మొదలగు సమాచారంతో ఆలయ కార్యనిర్వాహణాధికారి పేరిట భక్తులకు సమాచారం తెలిపారు.



HMTV

HMTV

Next Story