కొనసాగుతున్న ఏపీ మంత్రి మండలి సమావేశం

- వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం.

- వచ్చే ఆగస్టు 12న పధకం ప్రారంభించనున్న సీఎం జగన్.

- రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చ

- విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డ కెబినెట్.

- కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కెబినెట్ నిర్ణయం.

- ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం.

- మొదటి దశలో 4736 కోట్ల వ్యయంతో నిర్మాణం.

- రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం జగన్ సూచన.

- రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశం.

- 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

- డిస్కమ్, ట్రాన్స్కో లకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినెట్ ఆమోదం

- 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు కేబినెట్ ఆమోదం

Show Full Article
Print Article
Next Story
More Stories