Old Pension Scheme: రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ పాత పెన్షన్‌ స్కీంని అమలు చేస్తాయా..!

Will The State Governments Implement The Old Pension Scheme Again Know The Complete Rules
x

Old Pension Scheme: రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ పాత పెన్షన్‌ స్కీంని అమలు చేస్తాయా..!

Highlights

Old Pension Scheme: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తున్నాయి.

Old Pension Scheme: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే పాత పింఛను పథకాన్ని పునరుద్దరిస్తుందా లేదా అనే చర్చ నడుస్తోంది. అసలు ఈ స్కీంని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఈ రోజు తెలుసుకుందాం.

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా?

పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు దాదాపు వర్తించవు. ఏదైనా ప్రత్యేక రూల్ చేస్తే అది వేరే విషయం. పాత పెన్షన్ స్కీమ్ విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే అది రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తుంది. కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదు.

OPS, NPS అంటే ఏమిటి?

OPS కింద రిటైర్మెంట్‌ అయినప్పుడు ఉద్యోగులకు వారి చివరి జీతంలో 50% పెన్షన్‌గా లభిస్తుంది. లేదా గత పది నెలల సర్వీస్‌లో వారి సగటు ఆదాయాలు, ఏది ఎక్కువైతే అది వారికి చెల్లిస్తారు. ఇందుకోసం 10 ఏళ్ల సర్వీస్ పీరియడ్ తప్పనిసరిగా ఉండాలి. OPS కింద ఉద్యోగులు పెన్షన్‌కు సహకరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేసినందుకు రిటైర్మెంట్‌ తర్వాత, పెన్షన్, కుటుంబ పింఛనుకు హామీ ఉంటుంది. ఇది కొత్తదానిలో అందుబాటులో లేదు. NPSలో ప్రభుత్వ ఉద్యోగులు వారి బేసిక్‌ జీతంలో 10% NPSకి జమ చేస్తారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా NPSలో పాల్గొనవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories