Union Budget 2026: భారత బడ్జెట్ చరిత్రలో అరుదైన ఘట్టం: చిదంబరం రికార్డును సమం చేయనున్న నిర్మలా సీతారామన్!

Union Budget 2026: భారత బడ్జెట్ చరిత్రలో అరుదైన ఘట్టం: చిదంబరం రికార్డును సమం చేయనున్న నిర్మలా సీతారామన్!
x
Highlights

Union Budget 2026: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది.

Union Budget 2026: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం)న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక అరుదైన మైలురాయిని అధిగమించబోతున్నారు.

నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు: ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. 2019లో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను (ఒక మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) విజయవంతంగా సమర్పించిన ఆమె, ఈ ఏడాది 9వ ప్రసంగాన్ని చేయబోతున్నారు.

భారత బడ్జెట్ ప్రస్థానం - మైలురాళ్లు: భారతదేశ బడ్జెట్ చరిత్ర 160 ఏళ్ల నాటిది. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలు:

తొలి బడ్జెట్ (బ్రిటిష్ కాలం): ఏప్రిల్ 7, 1860న జేమ్స్ విల్సన్ భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

స్వతంత్ర భారత తొలి బడ్జెట్: నవంబర్ 26, 1947న తొలి ఆర్థిక మంత్రి ఆర్‌.కె. షణ్ముఖం చెట్టి స్వతంత్ర భారతావని తొలి పద్దును చదివారు.

ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన దిగ్గజాలు: భారత బడ్జెట్ చరిత్రలో అత్యధిక సార్లు పద్దులు సమర్పించిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరుతో ఉంది.

మొరార్జీ దేశాయ్: మొత్తం 10 బడ్జెట్లను ప్రవేశపెట్టి అగ్రస్థానంలో ఉన్నారు.

పి. చిదంబరం: ఈయన మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రసంగాలు చేశారు.

నిర్మలా సీతారామన్: ఈ ఏడాది బడ్జెట్‌తో చిదంబరం రికార్డును ఆమె సమం చేయనున్నారు.

ప్రణబ్ ముఖర్జీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ సమర్పించారు.

మన్మోహన్ సింగ్: ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్, 1991-1995 మధ్య వరుసగా 5 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

ఆదివారం సమర్పించబోయే బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సామాన్యులు, వేతన జీవులు మరియు పారిశ్రామిక వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను రాయితీలు, సంక్షేమ పథకాలపై నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories