ఈ రైతులకి 2000 రూపాయలు రావు.. వెంటనే జాబితాలో పేరు చెక్‌ చేయండి..!

These Farmers Will not Get 2000 Rupees Under PM Kisan Samman Nidhi Immediately Check the Name in the List
x

ఈ రైతులకి 2000 రూపాయలు రావు.. వెంటనే జాబితాలో పేరు చెక్‌ చేయండి..!

Highlights

ఈ రైతులకి 2000 రూపాయలు రావు.. వెంటనే జాబితాలో పేరు చెక్‌ చేయండి..!

PM Kisan Samman Nidhi: దేశంలోని కోట్లాది మంది రైతులకు త్వరలో శుభవార్త అందనుంది. ఎందుకంటే ప్రభుత్వం 13వ విడత పీఎం కిసాన్ యోజనను బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబోతోంది. మార్చి నెలలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని అందరు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా 14 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చగా ఈసారి చాలా మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2 వేల రూపాయలు జమకావడం లేదు. అనర్హుల జాబితాను ప్రభుత్వం తయారు చేసింది. మీరు ఈ జాబితాలోని పేరును చెక్‌ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం జారీ చేసిన నంబర్‌ని సంప్రదించాలి.

eKYC పూర్తి చేయండి

మీరు ఇంకా E-kyc పూర్తి చేయకుంటే వెంటనే చేయండి. లేదంటే ఖాతాలో డబ్బులు జమకావు. ఈ KYCని రెండు విధాలుగా చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. దీని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయాలి. భూమికి సంబంధించిన ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోని వారు వెంటనే ఈ పనిని పూర్తి చేయండి.

జాబితాలో పేరు చెక్‌ చేయండి

13వ విడతగా బ్యాంకు ఖాతాలో 2 వేల రూపాయలు వస్తాయో లేదో తెలుసుకోవడానికి PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ ముందుగా ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయవచ్చు. భూమి వివరాలు e-KYC అయిందా లేదా తెలుస్తుంది. స్టేటస్‌పై అవును అని రాసి ఉంటే మీకు రూ.2,000 బదిలీ అవుతుందని అర్థం చేసుకోండి. అక్కడ ఏమి రాయకుంటే వాయిదా రాదని అర్థం చేసుకోండి.

పరిష్కారం కోసం ఈ నంబర్

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత ఆగిపోకూడదని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులు అధికారిక ఇమెయిల్ ఐడి [email protected] లో సంప్రదించవచ్చు . ఇది కాకుండా హెల్ప్‌లైన్ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు. 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092. నంబర్స్‌కి కాల్‌ చేసి సమస్య గురించి విన్నవించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories