బుల్ జోష్.. దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాలు..

Arun Chilukuri
Published on: 2 Feb 2021 5:32 PM IST
బుల్ జోష్.. దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాలు..
X

బుల్ జోష్.. దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాలు..

దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాటన ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు మేర ర్యాలీ చేయగా నిఫ్టీ 50 సైతం 14,500 పాయింట్ల ఎగువకు చేరింది. ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న కేంద్ర బడ్జెట్‌కు మార్కెట్ వర్గాలు సాదర స్వాగతం పలికిన నేపధ్యంలో సూచీలు లాబాల బాటన పరుగులు తీశాయి. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెరగడంతో పాటు పన్నుల భారం ఎక్కువగా ఉండకపోవడం కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపినట్లయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1197 పాయింట్లు ఎగసి 49,797 వద్దకు చేరగా , నిఫ్టీ 366 పాయింట్ల మేర లాభంతో 14,647 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story