Electro Bonds: జనవరి 1 నుంచి 10 వరకు ఎలక్ట్రో బాండ్లను జారీ చేయనున్న ఎస్బీఐ

SBI Issuing Electro Bonds From January 1 to 10 2022 | Business News
x

Electro Bonds: జనవరి 1 నుంచి 10 వరకు ఎలక్ట్రో బాండ్లను జారీ చేయనున్న ఎస్బీఐ

Highlights

Electro Bonds: *జనవరి 1 నుంచి 10 వరకు ఎస్బీఐ ఎలక్ట్రో బాండ్లను జారీ చేయనుంది. *ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

Electro Bonds: జనవరి 1 నుంచి 10 వరకు ఎస్బీఐ ఎలక్ట్రో బాండ్లను జారీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఎస్‌బీఐకి తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేందుకు అధికారం ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్‌ని అదే రోజున జమ చేస్తారు. జనవరి 2, 2018 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లను నోటిఫై చేసిందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి?

ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్. వ్యక్తులు, సంస్థలు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగించవచ్చు. మొదటి దశలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం 2018 మార్చి 1 నుంచి 10 వరకు జరిగింది. ఎలక్టోరల్ బాండ్లను రూ. 1000, రూ. 10,000 రూ. 1 లక్ష, రూ. 1 కోటి గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన SBI శాఖలలో అందుబాటులో ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్లను KYC ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

బాండ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందించాలి. రాజకీయ పార్టీ ఈ బాండ్‌ను బ్యాంకులో ధృవీకరించబడిన ఖాతా ద్వారా నగదు చేస్తుంది. బాండ్‌పై దాత పేరు ఉండదు దాని వివరాలు బ్యాంకు వద్ద మాత్రమే ఉంటాయి. ఈ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజులలో కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories