
Rs.2000 Note : రూ.2000నోట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన
Rs.2000 Note: ఆర్బీఐ రూ.2000 నోట్లపై ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు గడిచినా ఇంకా రూ.6,017 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Rs.2000 Note: ఆర్బీఐ రూ.2000 నోట్లపై ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు గడిచినా ఇంకా రూ.6,017 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం. 2023, మే 19న రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయానికి మార్కెట్లో దాదాపు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండేవి. కానీ, ప్రజలు, బ్యాంకుల సహకారంతో 2025, జూలై 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి రూ.6,017 కోట్లకు చేరింది. అంటే, మొత్తం నోట్లలో దాదాపు 98.31 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో అవకాశం కల్పించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో నేరుగా వెళ్లి మీ రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి. ఆర్బీఐ మరో సులువైన మార్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా మీ రూ.2000 నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనికైనా పంపవచ్చు. ఈ నోట్లు ఆర్బీఐ కార్యాలయానికి చేరిన తర్వాత, వాటి విలువను మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మీరు మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులు అక్టోబర్ 9, 2023 నుంచే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కరెన్సీ అవసరాలను త్వరగా తీర్చడం కోసం రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. ఈ నోట్ల ముద్రణను 2018-19లోనే నిలిపివేశారు. ఆర్బీఐ ప్రకారం, ఈ నోట్లు మార్చి 2017కి ముందు ఎక్కువగా ముద్రించబడ్డాయి. వాటి జీవితకాలం దాదాపు 4-5 సంవత్సరాలు మాత్రమే. పైగా ఈ నోట్లు ప్రజల రోజువారీ లావాదేవీల్లో పెద్దగా కనిపించడం లేదు. అందుకే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా వీటిని ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నోట్లు ఉపసంహరించినా కూడా, అవి చట్టబద్ధంగా చెల్లుబాటవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



