PM Kisan Yojana 14th Installment: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ యోజన 14వ విడతకు దూరం కానున్న 3 కోట్ల మంది.. ఎందుకంటే?

PM Kisan Samman Nidhi Yojana: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద, ప్రతి నాలుగు నెలలకు వచ్చే మొత్తంలో 14వ విడత రాబోతోంది. తదుపరి విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri
Published on: 8 Jun 2023 11:59 AM IST
PM Kisan Yojana 14th Installment Credit on June 10th 3 Crores Farmers May Loss Without ekyc
X

PM Kisan Yojana 14th Installment: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ యోజన 14వ విడతకు దూరం కానున్న 3 కోట్ల మంది.. ఎందుకంటే?

PM Kisan Samman Nidhi Yojana: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద, ప్రతి నాలుగు నెలలకు వచ్చే మొత్తంలో 14వ విడత రాబోతోంది. తదుపరి విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ యోజన కింద 14వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూన్ 10 లోపు ఎప్పుడైనా ఈ మొత్తం విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6000 రూపాయలను రైతుల ఖాతాలకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు మూడు విడతలుగా ఇస్తారు. ఒక్కో వాయిదా మొత్తం రూ.2000లు. ఈ పథకం కింద ఇప్పటివరకు 13వ విడత విడుదలైంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది రైతులకు 13వ విడత కూడా అందలేదు.

14వ విడతలో కోట్ల మంది రైతులకు నిరాశే..

14వ విడత పీఎం కిసాన్ యోజన నుంచి 3 కోట్ల మందికి పైగా రైతులు దూరం కావొచ్చని మీడియా నివేదికల్లో వస్తోంది. ఎందుకంటే చాలా మంది రైతులు ఇంకా EKYCని అప్‌డేట్ చేయలేదు. EKYC పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. ఇటువంటి పరిస్థితిలో, కేవైసీ పూర్తి చేయని రైతులకు తదుపరి విడత విడుదలలో జాప్యం ఎదురుకావొచ్చు.

ఈ పనిని ఎలా చేయాలి..

EKYని పూర్తి చేయడానికి, మీరు PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక్కడ మీరు e-KYC ఎంపికపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఆధార్, ఇతర అవసరమైన సమాచారాన్ని పూరించాల్సి ఉంది. దీన్ని పూరించిన తర్వాత మొబైల్ నంబర్, OTPని నమోదు చేయాలి. దీంతో eKYC పూర్తవుతుంది.

వారికి కూడా నిరాశే..

14వ విడత పొందడానికి, ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ల్యాండ్ వెరిఫికేషన్ లేనట్లయితే, మీరు పథకం తదుపరి విడత నుంచి ఆ రైతుల పేరు తొలగించే ఛాన్స్ ఉంది. మీరు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేయవచ్చు.

ఏ పత్రాలు అవసరం..

PM కిసాన్ యోజన కింద దరఖాస్తు చేసుకుంటే, మీ వద్ద ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story