రైతులకి అద్భుత అవకాశం.. ఈ పథకం కింద ఖాతాలోకి 15 లక్షల రూపాయలు..!

PM Kisan FPO Yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది.

Arun Chilukuri
Published on: 6 Dec 2022 5:24 PM IST
PM Kisan FPO Yojana Scheme Check for all Details
X

రైతులకి అద్భుత అవకాశం.. ఈ పథకం కింద ఖాతాలోకి 15 లక్షల రూపాయలు..!

PM Kisan FPO Yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. నిజానికి రైతుల ఆదాయాన్ని పెంచి వారి అప్పులు తీర్చేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. దీని కోసం కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించేందుకు రైతులకు 15 లక్షల రూపాయలను అందజేస్తోంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేయాలి.. ఎవరు అర్హులు తదితర వివరాలు తెలుసుకుందాం.

రైతులకు రూ.15 లక్షలు

రైతు సోదరులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం 'పిఎం కిసాన్ ఎఫ్‌పిఓ యోజన' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 15 లక్షల రూపాయలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు అందజేస్తారు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి 11 మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభం అవుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. దీని కోసం ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ఇప్పుడు హోమ్ పేజీలో FPO ఎంపికపై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు 'రిజిస్ట్రేషన్' ఎంపికపై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది.

5. ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని అందించండి.

6. తర్వాత పాస్‌బుక్ లేదా చెక్, ఐడి ప్రూఫ్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

7. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story