PM Kisan FPO Yojana Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ పథకంలో చేరితే రూ.15 లక్షలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

PM Kisan FPO Yojana Scheme: కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది.

Arun Chilukuri
Updated on: 6 Nov 2023 1:01 PM IST
PM Kisan FPO Yojana Gives 15 Lakh Rupees Check Here Full Details and How to Apply
X

PM Kisan FPO Yojana Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ పథకంలో చేరితే రూ.15 లక్షలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

PM Kisan FPO Yojana Scheme: కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది. పీఎం కిసాన్ యోజనతో పాటు రైతులకు పూర్తి స్థాయిలో రూ.15 లక్షలు ప్రభుత్వం అందజేస్తోంది. మీరు కూడా రూ. 15 లక్షల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఈ డబ్బును ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

PM కిసాన్ FPO పథకం గురించి మాట్లాడితే, భారతదేశాన్ని వ్యవసాయ దేశం అని పిలుస్తారని తెలిసిందే. కానీ నేటికీ రైతులకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవు. దీనికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ FPO పథకాన్ని ప్రారంభించింది.

వ్యవసాయ సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించడానికి FPO అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది.

PM కిసాన్ FPO పథకం ప్రయోజనాలను పొందేందుకు, రైతులు కనీసం 11 మంది రైతులను కలిగి ఉండే సంస్థ లేదా కంపెనీ (FPO)ని ఏర్పాటు చేసుకోవాలి.

ఈ ప్రభుత్వ పథకం ద్వారా, రైతులు వ్యవసాయ సంబంధిత పరికరాలు లేదా ఎరువులు, మందులు, విత్తనాలు వంటి వాటిని కొనుగోలు చేయడంలో సహాయం చేస్తారు. సమాచారం ప్రకారం, 2023-24 నాటికి 10 వేల FPOలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మీరు భారత ప్రభుత్వ జాతీయ వ్యవసాయ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్ (https://www.enam.gov.in) నుంచి ఈ ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story