సంవత్సరాంతంలో పెట్రోల్ బాంబ్ : 80 రూపాయలు చేరుకున్న పెట్రోల్.. రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్!

సంవత్సరాంతంలో పెట్రోల్ బాంబ్ : 80 రూపాయలు చేరుకున్న పెట్రోల్.. రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్!
x
Highlights

దేశీయంగా ఈ రోజు (31-12-2019) పెట్రోల్ ధరలు, డీజిలు ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పెట్రోల్ ధరలు హైదరాబాద్ లో లీటరుకు 80 రూపాయలకు దగ్గరకు చేరిపోయాయి....

దేశీయంగా ఈ రోజు (31-12-2019) పెట్రోల్ ధరలు, డీజిలు ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పెట్రోల్ ధరలు హైదరాబాద్ లో లీటరుకు 80 రూపాయలకు దగ్గరకు చేరిపోయాయి. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే పెట్రోల్ ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి.అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పైపైకి కదులుతుండడంతో దేశీయంగాను ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ప్రతి రోజూ ఉదయం 6 గంటల సమయానికి పెట్రోల్ ధరలు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్ల క్రితం అమలులోకి వచ్చింది. వినియోగదారుల సౌకర్యం కోసం హైదరాబాద్, అమరావతి సహా దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాలలో ఈరోజు పెట్రోల్ ధరలు ఇస్తున్నాము. పెట్రోల్, డీజిల్ ధరలు కంపెనీలను బట్టి కొద్దీ పాటి తేడాలు ఉంటాయి.

అదేవిధంగా ఒక కంపెనీకి చెందిన పెట్రోల్ బంకు నుంచి అదే కంపెనీకి చెందిన వేరే బంకుకు (ఒకే నగరంలో) మధ్య కూడా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా ఈ తేడా పైసల్లోనే ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న ధరలు ఆయా కంపెనీల వెబ్ సైట్ ల ( IOCL - HPCL - BP ) నుంచి సేకరించినవి.

ఆయా కంపెనీల వెబ్ సైట్ లలో పేర్కొన్న ధరలను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాము





Show Full Article
Print Article
More On
Next Story
More Stories