Gas Cylinder: సామాన్యులకు మరో షాక్.. గ్యాస్ సిలిండర్ డెలివరీ బంద్!

No Home Delivery of LPG Cylinders Major Strike on the Horizon
x

Gas Cylinder: సామాన్యులకు మరో షాక్.. గ్యాస్ సిలిండర్ డెలివరీ బంద్!

Highlights

Gas Cylinder: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 50 పెంచింది. ఇప్పుడు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ ప్రభుత్వానికి సమ్మె హెచ్చరిక జారీ చేసింది.

No Home Delivery of LPG Cylinders

Gas Cylinder: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 50 పెంచింది. ఇప్పుడు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ ప్రభుత్వానికి సమ్మె హెచ్చరిక జారీ చేసింది. తమ డిమాండ్లను, ముఖ్యంగా అధిక కమీషన్‌ను మూడు నెలల్లోగా పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని సంఘం ఆదివారం హెచ్చరించింది. సామాన్యులకు ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పొచ్చు.

అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఎస్. శర్మ ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిర్ణయం శనివారం భోపాల్‌లో జరిగిన అసోసియేషన్ జాతీయ సమావేశంలో తీసుకోబడింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సభ్యులు డిమాండ్ల పత్రాన్ని ఆమోదించారని ఆయన తెలిపారు. ఎల్‌పీజీ పంపిణీదారుల డిమాండ్ల గురించి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాశామన్నారు. ఎల్‌పీజీ పంపిణీదారులకు ఇస్తున్న ప్రస్తుత కమీషన్ చాలా తక్కువగా ఉందని, ఇది మెయింటెనెన్స్ ఖర్చులకు అనుగుణంగా లేదని ఆయన అన్నారు.

కమీషన్ పెంపు కోసం డిమాండ్

కేంద్ర ప్రభుత్వానికి సంఘం లేఖ రాస్తూ ఎల్‌పీజీ పంపిణీపై కమీషన్‌ను పెంచి కనీసం రూ. 150 చేయాలని డిమాండ్ చేసింది. ఎల్‌పీజీ సరఫరా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుందని లేఖలో పేర్కొంది. అయితే చమురు కంపెనీలు ఎలాంటి డిమాండ్ లేకుండానే పంపిణీదారులకు బలవంతంగా గృహేతర సిలిండర్‌లను పంపుతున్నాయని, ఇది చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. దీనిని వెంటనే నిలిపివేయాలని కోరింది. ఉజ్వల యోజన ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీలో కూడా సమస్యలు వస్తున్నాయని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తమ డిమాండ్లను 3 నెలల్లోగా పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని లేఖలో స్పష్టం చేసింది.

గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు

కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 7న గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 నుండి రూ. 853కి చేరుకుంది. అలాగే కోల్‌కతాలో ధర రూ. 829 నుండి రూ. 879కి, ముంబైలో రూ. 802.50 నుండి రూ. 853.50కి మరియు చెన్నైలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 818.50 నుండి రూ. 868.50కి పెరిగింది. మరోవైపు ఉజ్వల యోజన కింద లభించే గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories