Indian Railways: రూ. 1లక్ష పెట్టుబడితో.. రూ.16లక్షల లాభం.. వందే భారత్‌ కంటే వేగంగా దూసుకుపోతోన్న రైల్వే షేర్..!

Multibagger Stock Railway Stock Titagar Rail Systems Rs 30 Level and Crossed Rs 500
x

Indian Railways: రూ. 1లక్ష పెట్టుబడితో.. రూ.16లక్షల లాభం.. వందే భారత్‌ కంటే వేగంగా దూసుకుపోతోన్న రైల్వే షేర్..!

Highlights

Vande Bharat Train: మే 2020లో ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు అతని డబ్బు 16.98 లక్షలుగా మారిపోయింది. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు 369.52 శాతం లాభపడింది.

Titagarh Rail Systems: రైల్వే షేర్లలో డబ్బు పెట్టిన పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. రైల్వే స్టాక్స్ కొన్నేళ్లలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. రైల్వే స్టాక్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ షేర్లు రూ. 30 స్థాయి నుంచి రూ.500 దాటాయి. నేడు కంపెనీ షేరు రూ.516 స్థాయిలో ముగిసింది. టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ వందేభారత్ రైళ్ల కోసం కొద్ది రోజుల క్రితం ఆర్డర్‌ను పొందింది. ఆ తర్వాత స్టాక్‌కు రెక్కలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మూడేళ్లలో 1600 శాతం పెరిగిన షేర్ ధర..

టిటాగర్ రైల్ సిస్టమ్స్ షేర్లు గత 3 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 1600% రాబడిని అందించాయి. మే 22, 2020న, టిటాగర్ రైల్ సిస్టమ్ షేర్ రూ.30 స్థాయిలో ఉంది. కాగా, ఈరోజు అంటే జులై 4, 2023న కంపెనీ స్టాక్ రూ.516 స్థాయిలో ముగిసింది.

1 లక్ష 16 లక్షలుగా మారింది..

మే 2020లో ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు అతని డబ్బు 16.98 లక్షలుగా మారిపోయింది. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు 369.52 శాతం లాభపడింది. జులై 5, 2022న, కంపెనీ స్టాక్ ధర రూ. 109 స్థాయిలో ఉంది. ఈ కాలంలో షేరు రూ. 406.10 శాతం పెరిగింది.

6 నెలల్లో స్టాక్ ఎంత పెరిగిందంటే?

గత నెల చార్ట్‌ను పరిశీలిస్తే, ఈ కంపెనీ షేరు 37.36 శాతం అంటే రూ.140.35 లాభపడింది. అదే సమయంలో, గత 6 నెలల్లో, కంపెనీ స్టాక్ 121.03 శాతం అంటే రూ. 282.55 శాతం పెరిగింది.

ఈ స్టాక్ 52 వారాల రికార్డు స్థాయి రూ. 525.00లకు చేరుకుంది. అలాగే కనిష్ట స్థాయి రూ. 432.90లు. ఏడాదిలో ఈ షేరు రూ.686కు పెరుగుతుందని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ అభిప్రాయపడింది.

కంపెనీ వ్యాపారం ఏమిటి?

వ్యాగన్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టిటాగర్ రైల్ సిస్టమ్స్ ఇప్పుడు భారతదేశంలోని ప్యాసింజర్ రైలు వ్యవస్థల అతికొద్ది మంది ఇంటిగ్రేటెడ్ తయారీదారులలో ఒకటి అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ సెటప్‌ను రూపొందించింది. ఇది పునరావృతం చేయడం కష్టం. రాబోయే ఐదేళ్లలో దాని టర్నోవర్‌ను రూ. 9,000-10,000 కోట్లకు పెంచుకునే అవకాశం ఉంది.

(గమనిక: ఇక్కడ స్టాక్ పనితీరు మాత్రమే అదించాం. ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తప్పక తీసుకోవాలి.)

Show Full Article
Print Article
Next Story
More Stories