
Central Govt farmers Scheme: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎన్నో పథకాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పథకాన్ని కూడా అందిస్తోంది.
Central Govt Farmers Scheme: రైతులు మన దేశానికి వెన్నుముఖ. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఇప్పటికే ఎన్నో అద్బుతమైన పథకాలను రైతుల కోసం ప్రారంభించింది. అయితే, తాజాగా మరో పథకం కూడా కేంద్ర తీసుకువచ్చింది. దాదాపు 90 శాతం పథకంతో ఈ కొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. రైతుల సమస్యల పరిష్కరణ, నీటిపారుదలకు సంబంధించిన ప్రధాన మంత్రి సించాయ్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ బడ్జెట్లో కేంద్రం ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి దాదాపు రూ.1600 కోట్లు కూడా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడానికి ప్రధాన కారణం చిన్న సన్నకారు రైతులు నీటి సరఫరాలో లాంటి ఇబ్బందులు పడకుండా సాంప్రదాయ నీటి వ్యవస్థలను ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధించడానికి ఈ పథకం ప్రారంభించారు. దేశంలో నీటి ఎద్దడి ఏర్పడుతున్న ఈ తరుణంలో ఇలా సాంప్రదాయ నీటి వ్యవస్థను ఆధునికీకరిచడం ఎంతో ఆవశ్యకం.
తద్వారా రైతుల నీటి సమస్యలు తగ్గిపోతాయి. మరుగున పడిన నీటి కాలువలను కొత్త సంకేతికతతో అనుసంధించడం వంటివి చేయనున్నారు. పంట ఉత్పత్తి పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ పథకం అమలుకు స్థానికంగా కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వారే ఈ పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల యువ రైతులను కూడా ఆకట్టుకుంటుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire