Alert: అలర్ట్‌.. జూలై 1లోపు ఈ పనిచేయకపోతే 10,000ల నష్టం..!

Alert: ఈ రోజుల్లో పాన్, ఆధార్ కార్డులు చాలా ముఖ్యమైన పత్రాలు అని చెప్పవచ్చు. అయితే మీరు పాన్, ఆధార్ లింక్‌ చేయకపోతే వెంటనే చేయండి.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 10:00 AM IST
Link PAN Aadhaar by July 1 or 10 Thousand Fine
X

Alert: అలర్ట్‌.. జూలై 1లోపు ఈ పనిచేయకపోతే 10,000ల నష్టం..!

Alert: ఈ రోజుల్లో పాన్, ఆధార్ కార్డులు చాలా ముఖ్యమైన పత్రాలు అని చెప్పవచ్చు. అయితే మీరు పాన్, ఆధార్ లింక్‌ చేయకపోతే వెంటనే చేయండి. లేదంటే మీరు భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పాన్‌, ఆధార్‌ను లింక్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. జూలై 1లోగా లింక్ చేయకుంటే రెట్టింపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఇటీవల పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. నిర్ణీత గడువులోగా మీరు మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది.

ఇప్పటి వరకు ఈ రుసుము రూ. 500గా ఉండేది. అయితే నిర్ణీత గడువులోపు అంటే జూలై 1లోపు ఈ పనిని చేయకపోతే మీరు రెట్టింపు రుసుము చెల్లించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయనందుకు రుసుముగా 1000 రూపాయలు చెల్లించాలి. మీరు జరిమానాలతో పాటు అనేక ఇతర నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాన్ కార్డ్ పనిచేయకుండా పోతుంది. దీని కారణంగా మీరు ఆర్థిక లావాదేవీలు చేయలేరు. మీరు ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు.

మీ పన్ను వాపసు నిలిచిపోవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు ఆర్థిక లావాదేవీలలో పాన్‌కార్డుని ఉపయోగించలేరు. మీరు కొత్త బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు పాన్ కార్డ్‌ని ఉపయోగించలేరు. దీంతో పాటు చెల్లని పాన్ కార్డ్‌పై 10 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ నంబర్, ఆధార్‌ను లింక్ చేయడానికి మొదట ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్‌కు వెళ్లాలి. ఇక్కడ ఎడమవైపు క్విక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో లింక్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పాన్, ఆధార్ నంబర్, పేరు ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీనిని నమోదు చేసిన తర్వాత ఆధార్, పాన్ లింక్ అవుతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story