Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ. 20కే భోజనం.. రూ.3కే వాటర్ ..!

IRCTC BIG Update: రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకించి సరసమైన ధరలకు సాధారణ కోచ్ ప్రయాణికులకు భోజనం, ప్యాకేజ్డ్ వాటర్ అందించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

Arun Chilukuri
Updated on: 21 July 2023 12:30 PM IST
Indian Railways Offer to General Coach Passengers Food for RS 20 Meals and RS 3 Water
X

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ. 20కే భోజనం.. రూ.3కే వాటర్ ..!

IRCTC BIG Update: రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకించి సరసమైన ధరలకు సాధారణ కోచ్ ప్రయాణికులకు భోజనం, ప్యాకేజ్డ్ వాటర్ అందించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సాధారణ కోచ్‌లకు సంబంధించిన ప్లాట్‌ఫారమ్‌లపై ఈ భోజనాన్ని అందించే కౌంటర్లు ఉంచనున్నారంట.

అవును, ఇక నుంచి రైలులోని రెగ్యులర్ కోచ్‌లో ప్రయాణించే వ్యక్తులు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై జనరల్ క్యారేజ్ ముందు 'ఎకానమీ మీల్స్' స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. సాధారణ కోచ్‌లలో ప్రయాణించే వారు తిండి, పానీయాల కోసం స్టేషన్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే ప్రయాణికులకు ఎకానమీ ధరలకే భోజనం, స్నాక్స్ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

దీనికి సంబంధించి జూన్ 27న రైల్వే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ కోచ్‌ల దగ్గర ప్లాట్‌ఫారమ్‌పై ఎకానమీ భోజనం, స్నాక్స్ అందించాలని జారీ చేసిన లేఖలో సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరుస్తున్నామని, జోనల్ రైల్వే ద్వారా లొకేషన్ నిర్ణయిస్తామని చెబుతున్నారు.

పూరీ, కూరగాయలు, ఊరగాయ రూ.20లకే..

రైల్వే శాఖ నిర్ణయించిన క్యాటరింగ్ ధర ప్రకారం ప్రయాణికులకు 7 పూరీలు, 150 గ్రాముల కూరగాయల కర్రీ, ఊరగాయ ప్యాకెట్ రూ.20కి లభిస్తాయి.

అందుబాటులో 2 రకాల ఆహారం..

భోజనం టైప్ 1లో రూ.20కి 7 పూరీలు, కూరగాయలు, పచ్చళ్లు ఉంటాయి. టైప్ 2 భోజనం కోసం రూ.50లు. ఇందులో మీకు 350 గ్రాముల స్నాక్స్, భోజనం లభిస్తుంది. రూ.50 అల్పాహారం కోసం మీరు రాజ్మా-రైస్, ఖిచ్డీ, చోలే కుల్చే, చోలే భాతురే, పావ్ భాజీ లేదా మసాలా దోస పొందుతారు. అంతేకాకుండా రూ.3కే 200ఎంఎం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంటుంది.

జనరల్ కోచ్‌లు సాధారణ సీటు కోచ్‌ని సూచిస్తాయి. ఇది 2వ తరగతి అన్‌రిజర్వ్‌డ్ కోచ్. సాధారణంగా మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా ప్రతి రైలులో ఇంజిన్ దగ్గర కనీసం 2 జనరల్ కోచ్‌లు ఉంటాయి. రైలు చివరిలో ఒకటి ఉంటాయి. కౌంటర్‌లో కొనుగోలు చేసిన జనరల్/అన్‌రిజర్వ్‌డ్ టికెట్ ఉన్న ఎవరైనా ఆ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించవచ్చు. IRCTC క్యాటరింగ్ యూనిట్ల నుంచి భోజనం అందించాలి' అని ఆర్డర్‌లో పేర్కొంది.

IRCTC అన్ని స్టాల్స్, ప్యాంట్రీ కార్లు 1 లీటర్ రైల్ వాటర్ బాటిల్‌ను రూ. 15కి మాత్రమే విక్రయిస్తామని ప్రకటించాయి. అదనపు ఛార్జీల విషయంలో, ప్రయాణికులు ఏదైనా స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story