Haunted Railway Station: వింత శబ్దాలు, విచిత్ర ఆకారాలు.. అడుగుపెడితే ఒళ్లు జళదరించాల్సిందే.. దేశంలో 4 భయానక రైల్వే స్టేషన్లు ఇవే..!

India's Haunted Railway Station: దేశంలో హాంటెడ్ అని పిలవబడే కొన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయని మీకు తెలుసా. ఇక్కడి నుంచి రైలు ఎక్కేటప్పుడు లేదా దిగుతున్నప్పుడు జనం చెమటలు కక్కుతుంటారు. ప్రజలు అడుగుపెట్టేందుకు భయపడే 4 రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Arun Chilukuri
Updated on: 21 Jun 2023 7:00 PM IST
Indian Railways Interesting Facts From Mumbai Dombivli Railway Station to Kolkata Ravindra Sarovar Metro Station These 4 Haunted Railway Stations in India
X

Haunted Railway Station: వింత శబ్దాలు, విచిత్ర ఆకారాలు.. అడుగుపెడితే ఒళ్లు జళదరించాల్సిందే.. దేశంలో 4 భయానక రైల్వే స్టేషన్లు ఇవే..!

Haunted Railway Station in India: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌లో 3 వేలకు పైగా స్టేషన్‌లు ఉన్నాయి. వాటి నుంచి ప్రతిరోజూ 4 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి తరచుగా రైల్వే ద్వారా ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే దేశంలో హాంటెడ్ అని పిలవబడే కొన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయని మీకు తెలుసా. ఇక్కడి నుంచి రైలు ఎక్కేటప్పుడు లేదా దిగుతున్నప్పుడు జనం చెమటలు కక్కుతుంటారు. ప్రజలు అడుగుపెట్టేందుకు భయపడే 4 రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ముంబయి డోంబివిలి రైల్వే స్టేషన్..

ముంబైలోని డోంబివాలి రైల్వే స్టేషన్ భారతదేశంలో హాంటెడ్ రైల్వే స్టేషన్‌గా పేరుగాంచింది. ఇక్కడ రాత్రిపూట ఒక మహిళ తన రైలు కోసం వేచి చూస్తుందని చెబుతుంటారు. దీనికి సంబంధించి ఒక భయానక కథనం ఉందంట. ఒకసారి ఒక వ్యక్తి తన వెళ్లాల్సిన రైలు కోసం రాత్రి స్టేషన్‌లో నిల్చున్నాడంట. అక్కడ ఓ మహిళ ఏడుస్తూ కనిపించిందంట. అతను ఏడుపుకి కారణాన్ని అడిగినప్పుడు, ఆమె తన రైలును అందుకోవాలని, కానీ అందుకోలేకపోయిందని చెప్పుకొచ్చిందంట. మరుసటి రోజు ఆ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి రాత్రి అదే ప్లాట్‌ఫారమ్‌కి చేరుకున్నాడు. అక్కడ అతను రైలు కోసం వేచి ఉండగా అదే మహిళ ఏడుపు చూశాడంట. కానీ, ఆ మహిళ తన స్నేహితుడికి కనిపించలేదంట. అప్పటి నుంచి ‎ఆ స్త్రీ దెయ్యం కథ అక్కడ ఊరువాడల వ్యాపించింది.

కోల్‌కతా రవీంద్ర సరోవర్ మెట్రో స్టేషన్ (కోల్‌కతా రవీంద్ర సరోబార్ మెట్రో స్టేషన్)..

కోల్‌కతాలోని ఈ మెట్రో స్టేషన్‌ను 'ఆత్మహత్యల స్టేషన్' అని కూడా పిలుస్తారు. అక్కడ చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇందుకు కారణం. ఒక ప్రదేశంలో చాలా మంది చనిపోతే, ఆ ప్రదేశం ఆటోమేటిక్‌గా భారతదేశంలో హాంటెడ్ రైల్వే స్టేషన్‌గా మారుతుంది. ఈ మెట్రో స్టేషన్‌లో రాత్రిపూట చాలా మంది అరుపులు, ఏడుపుల గొంతులు తమకు వినిపించాయని పలువురు పేర్కొంటున్నారు. రాత్రి పొద్దుపోయాక ఎవరూ కనిపించక పోవడంతో ఈ స్టేషన్ నిర్మానుష్యంగా మారడానికి కారణం ఇదే.

పశ్చిమ బెంగాల్‌లోని బెగుంకోదర్ రైల్వే స్టేషన్..

ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని బెగన్‌కోడర్‌లో కూడా ఉంది. భారతదేశంలో హాంటెడ్ రైల్వే స్టేషన్‌గా పేరుగాంచినందున, ఈ రైల్వే స్టేషన్ 42 సంవత్సరాలుగా మూతపడే ఉంది. తెల్లటి చీర కట్టుకుని రాత్రి వేళల్లో ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను తరచూగా చూస్తుంటామని చాలా మంది చెబుతుంటారు. ఆ మహిళ రైలు నుంచి పడిపోయి చాలా సంవత్సరాల క్రితం చనిపోయి ఉందని చెబుతుంటారు. కానీ, ఆమెకు మోక్షం లభించలేదని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే స్టేషన్‌లో నిరంతరం తిరుగుతూనే ఉంటుందంట. ఘోస్ట్లీ స్టేషన్ గురించి చర్చ వ్యాపించగానే.. దీనిని మూసివేశారంట. అయితే, ప్రస్తుతం ఈ స్టేషన్‌ను ప్రారంభించారు.

హిమాచల్ ప్రదేశ్ బరోగ్ రైల్వే స్టేషన్..

బరోగ్ రైల్వే స్టేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో నిర్మించారు. ఈ స్టేషన్‌కు చేరుకోవడానికి, పర్వతాన్ని తొలగించి ద్వారా ఒక సొరంగం తయారు చేశారు. ఈ పనిని బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ బరోగ్ చేశారు. నిర్మాణ సమయంలోనే ఇంజనీర్ సొరంగంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఇప్పుడు అదే ఇంజనీర్ ఆత్మ బరోగ్ రైల్వే స్టేషన్‌లో తిరుగుతూనే ఉందని చెబుతున్నారు. సాయంత్రం కాగానే ఈ స్టేషన్‌లో వింత సంఘటనలు జరుగుతాయని పలువురు అంటున్నారు. దీనివల్ల సాయంత్రం పూట ఇక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడరంట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story