Salary Hike: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రూ.8వేలు పెరగనున్న జీతం.. ఎవరికంటే?

Govt Employees may get 46 Percent DA From 1st July to December 2023 Says 7th Pay Commission
x

Salary Hike: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రూ.8వేలు పెరగనున్న జీతం.. ఎవరికంటే?

Highlights

7th Pay Commission: మార్చి చివరి వారంలో కేంద్ర ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో కేంద్ర ఉద్యోగులకు మరో కానుక ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి చివరి వారంలో కేంద్ర ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో కేంద్ర ఉద్యోగులకు మరో కానుక ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పు తర్వాత, కేంద్ర ఉద్యోగుల జీతంలో బంపర్ పెరుగుదల ఉంటుంది. ఈసారి కూడా ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచి 46 శాతానికి పెంచుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

4 శాతం డీఏ పెంపు..

మార్చి 2023లో ప్రభుత్వం 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది. దీని తర్వాత, కరువు భత్యం 42 శాతానికి పెరిగింది. ఈ పెంపును ప్రభుత్వం జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చింది. ఇప్పుడు తదుపరి డీఏ జులై 1 నుంచి వర్తిస్తుంది. ద్వితీయార్థంలో డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) నాలుగు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. జులై 1 నుంచి వర్తించే డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి 2023 జులై నుంచి డిసెంబరు వరకు ద్వితీయార్థంలో DA పెంపుదల ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతిసారీ సెకండాఫ్ డీఏ సెప్టెంబర్-అక్టోబర్‌లో ప్రకటిస్తారు. కానీ, ఈసారి ఆగస్ట్‌లో పెంచిన డీఏను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఏడాది ప్రథమార్థానికి 4 శాతం పెంపుదల ఇప్పటికే ప్రకటించారు. ద్రవ్యోల్బణం దృష్ట్యా కేంద్ర ఉద్యోగుల డీఏను ప్రభుత్వం పెంచింది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డీఏ పెరుగుదల కూడా ఎక్కువగానే ఉంటుంది.

జీతం ఎంత పెరుగుతుంది?

సెకండాఫ్‌లో కేంద్ర ఉద్యోగుల డీఏను 46 శాతానికి పెంచితే.. దానికి అనుగుణంగా జీతం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక కేంద్ర ఉద్యోగి ప్రస్తుతం రూ. 18,000 ప్రాథమిక వేతనం కలిగి ఉంటే, ప్రస్తుతం 42 శాతం చొప్పున రూ.7560 డీఏ పొందుతున్నారు. అతని డీఏ 46 శాతానికి పెరిగితే, ఆ ఉద్యోగి కరువు భత్యం రూ.8,280 అవుతుంది. ఈ విధంగా ప్రతి నెలా రూ.720 (ఏటా రూ.8640) పెరగనుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories