40 వేలు దాటిన బంగారం! పరుగులు తీస్తున్న వెండి!

40 వేలు దాటిన బంగారం! పరుగులు తీస్తున్న వెండి!
x
Highlights

రెండు రోజులు భారీ పెరుగుదల నమోదు చేసి నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మరింత పైకి కదిలాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి....

రెండు రోజులు భారీ పెరుగుదల నమోదు చేసి నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మరింత పైకి కదిలాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 370 రూపాయలు పెరిగింది. దీంతో 40,330 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 36,970 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి ఒక్కసారిగా 300 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,800 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,330 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,970 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగింది. దీంతో 38,950 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,750 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 300 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 47,800 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories