నిలకడగానే బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి!

నిలకడగానే బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి!
x
Highlights

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,190 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 35,910 రూపాయల వద్ద ఉంది. అయితే, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కేజీకి 50 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 వద్దకు చేరింది.

ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,190 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 35,910 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 37,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,700 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories