Gold Rate Today: ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే?

Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు మరో షాక్ తగిలింది. మంగళవారం దేశీయ మార్కెట్లో పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకొని జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.
Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు మరో షాక్ తగిలింది. మంగళవారం దేశీయ మార్కెట్లో పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకొని జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. సాధారణంగా సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు తగ్గకపోగా, నిరంతరం పెరుగుతుండడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నేటి ట్రేడింగ్లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.520 పెరిగింది. ఈ పెరుగుదలతో పసిడి ధర రూ.1,12,750 అనే ఆల్ టైం గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
అంతేకాకుండా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా బంగారం ధరలకు ఊతమిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే పెట్టుబడిదారులు బాండ్ల వంటి సురక్షిత సాధనాల నుంచి బంగారంలోకి తమ పెట్టుబడులను మళ్లించే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



