లాభాల బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు!

లాభాల బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు!
x
Highlights

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వారాంతాన ఇన్వెస్టర్లకు లాభాలను మిగిల్చాయి..

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వారాంతాన ఇన్వెస్టర్లకు లాభాలను మిగిల్చాయి.. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్లు పుంజుకుని 40,685 వద్దకు చేరగా, నిఫ్టీ 33 పాయింట్ల మేర లాభంతో 11,930 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు పండగ సమయాన విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీ విపణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ లో పదిగ్రాముల బంగారం స్వల్పంగా పెరిగి 50,868 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో పసిడి ధర 52,740 రూపాయలుగా నమోదయింది..ఇక దేశంలోని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత మూడు వారాలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయల 25 పైసలు వద్దకు చేరగా.. డీజిల్ ధర లీటర్‌కు 76 రూపాయల 84 పైసలుగా నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories