Indian Currency Notes: దేశంలో నోట్లను ఎక్కడ ముద్రిస్తారు.. కాగితం, ఇంక్ ఎక్కడ నుంచి సేకరిస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!

Indian Currency Notes: దేశంలో నోట్లను ఎక్కడ ముద్రిస్తారు.. కాగితం, ఇంక్ ఎక్కడ నుంచి సేకరిస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!
Indian Currency Notes: 2000 రూపాయల నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2000 రూపాయల నోట్లను ఇప్పుడు చెలామణి నుంచి తీసివేస్తున్నట్లు, 23 సెప్టెంబర్ 2023 తర్వాత అందుబాటులో ఉండవని RBI తెలిపింది.
Indian Currency Notes: 2000 రూపాయల నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2000 రూపాయల నోట్లను ఇప్పుడు చెలామణి నుంచి తీసివేస్తున్నట్లు, 23 సెప్టెంబర్ 2023 తర్వాత అందుబాటులో ఉండవని RBI తెలిపింది. ఇప్పుడు మనం భారత కరెన్సీ నోట్ల గురించి మాట్లాడితే, మీరు రోజూ ఉపయోగించే నోట్లు భారతదేశంలో ఎక్కడ ముద్రిస్తారో మీకు తెలుసా? ఇది కాకుండా, అలాగే కరెన్సీ నోట్లను ఉపయోగించే కాగితం, ఇంక్ ఎక్కడ నుంచి వస్తాయో మీకు తెలుసా? మీకు దాని గురించి తెలియకపోతే.. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
భారతదేశం అంతటా ఎన్నో ప్రింటింగ్ ప్రెస్లు..
భారతదేశంలో కరెన్సీని ముద్రించడానికి మొత్తం 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉపయోగించే నోట్లను ఈ 4 ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రిస్తారు. ఈ నోట్లను ముద్రించే పనిని భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తాయి.
ఇంగ్లండ్ నుంచి దిగుమతి..
దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రింటింగ్ ప్రెస్ల గురించి మాట్లాడితే.. దేశంలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ 1926 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్లో ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడ 10, 100, 1000 రూపాయల నోట్లు ముద్రించేవారు. అయితే, ఆ సమయంలో కొన్ని నోట్లు ఇంగ్లండ్ నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత, 1975 సంవత్సరంలో, భారతదేశంలో రెండవ ప్రింటింగ్ ప్రెస్ మధ్యప్రదేశ్లోని దేవాస్లో ప్రారంభించారు. 1997 సంవత్సరం వరకు, దేశవ్యాప్తంగా ఉపయోగించిన నోట్లను ఈ రెండు ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రించేవారు.
అమెరికా, కెనడా, యూరప్ నుంచి భారతీయ నోట్లు..
1997 సంవత్సరం నుంచి, భారత ప్రభుత్వం అమెరికా, కెనడా, యూరప్ కంపెనీల నుంచి నోట్లను ఆర్డర్ చేయడం ప్రారంభించింది. అయితే, నోట్లను ముద్రించడానికి 1999లో కర్ణాటకలోని మైసూర్లో, 2000లో పశ్చిమ బెంగాల్లోని సల్బోనిలో మరో రెండు ప్రింటింగ్ ప్రెస్లు ప్రారంభించారు.
నోట్ల కోసం ఉపయోగించే కాగితం ఎక్కడి నుంచి వస్తుందంటే..
భారతీయ కరెన్సీ కోసం ఉపయోగించే కాగితం గురించి మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, నోట్ల కోసం ఉపయోగించే కాగితంలో 80% జర్మనీ, యూకే, జపాన్ నుంచి వస్తుంది. అయితే, భారతదేశంలో నోట్ల కోసం ఉపయోగించే పేపర్ మిల్లు కూడా ఉంది. ఇది మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉంది. ఇక్కడ నోట్, స్టాంప్ పేపర్ కోసం ఉపయోగించే కాగితం తయారు చేస్తుంటారు.
నోట్లలో వాడే ఇంక్ని ఎక్కడి నుంచి వస్తుందంటే..
అంతే కాకుండా నోట్లలో ఉపయోగించే ఇంక్ గురించి మాట్లాడితే.. ఈ ఇంక్ స్విస్ కంపెనీ SICPA నుంచి దిగుమతి చేసుకుంటుంటారు. కర్ణాటకలోని మైసూర్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (BRBNMPL) అనుబంధ సంస్థ, నోట్లలో ఉపయోగించే సిరాను తయారు చేసే యూనిట్ ఉంది. ఈ యూనిట్ పేరు వెర్నికా.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



