
Bank Job Alert: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఖాళీలు త్వరలో భర్తీ
Bank Job Alert: బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలో ప్రభుత్వ బ్యాంకులు 50,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాయి.
Bank Job Alert: బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలో ప్రభుత్వ బ్యాంకులు 50,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో బ్యాంకులపై పనిభారం పెరిగిందని చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ భారీ నియామకాలతో బ్యాంక్ ఉద్యోగులకు చాలా ఉపశమనం లభించనుంది. వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త నియామకాల్లో సుమారు 21,000 మంది అధికారులు ఉంటారు. మిగిలిన వారు క్లర్కులు, ఇతర ఉద్యోగులు ఉంటారు.
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు లోకెల్లా అతి పెద్దదైన భారతీయ స్టేట్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అధికారులతో సహా సుమారు 20,000 మందిని నియమించుకోనుంది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన ఎస్బీఐ, దేశవ్యాప్తంగా తన శాఖల్లో కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి 505 ప్రొబేషనరీ ఆఫీసర్లను, 13,455 జూనియర్ అసోసియేట్లను ఇప్పటికే భర్తీ చేసింది.
ఈ 13,455 జూనియర్ అసోసియేట్ల నియామకాలు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో చేపట్టారు. మార్చి 2025 నాటికి ఎస్బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,36,226. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకులో 1,15,066 మంది అధికారులు పని చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి పర్మనెంట్ ఉద్యోగికి సగటు జీతం రూ.40,440.59 గా ఉంది. ఎస్బీఐ నుండి ప్రతి సంవత్సరం రెండు శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేస్తారు.
దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగుల సంఖ్యను 5,500 మందికి పైగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2025 నాటికి పీఎన్బీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,02,746. మరో ప్రభుత్వ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది.
ఈ లోగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక సలహా ఇచ్చింది. వారు తమ అనుబంధ సంస్థలలో తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయడం ద్వారా డబ్బుగా మార్చుకోవాలని సూచించింది. దీనివల్ల వారికి మంచి రాబడి లభిస్తుంది. బ్యాంకులకు చెందిన సుమారు 15 అనుబంధ సంస్థలు లేదా జాయింట్ వెంచర్లు మీడియం నుంచి లాంగ్ టర్మ్ ఐపీఓ లేదా పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. అవసరమైన చోట, బ్యాంకులు తమ అనుబంధ సంస్థలు లేదా జాయింట్ వెంచర్ల కార్యకలాపాలను పెంచడానికి డబ్బును పెట్టుబడిగా పెట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. సరైన సమయంలో ఈ పెట్టుబడుల విలువను తిరిగి పొందాలని బ్యాంకులు ఆలోచించవచ్చని అధికారులు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




