Alert: అలర్ట్‌.. మార్చి 31లోపు ఈ పనులు చేయకుంటే భారీనష్టం..!

Alert to Consumers if These Things are not Done Before March 31 They Will Have to Lose a lot
x

Alert: అలర్ట్‌.. మార్చి 31లోపు ఈ పనులు చేయకుంటే భారీనష్టం..!

Highlights

Alert: మార్చి నెల అందరికీ చాలా ముఖ్యమైంది.

Alert: మార్చి నెల అందరికీ చాలా ముఖ్యమైంది. ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో అందరికీ ఈ నెల చాలా ముఖ్యం. మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే మార్చి 31 లోపు చాలా పనులను పూర్తి చేయాలి. రాబోయే 31 రోజులలో ఏ ఏ పనులను పూర్తి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

PM వయ వందన యోజన

మీరు ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చివరి అవకాశం. ఈ పథకం 60 ఏళ్ల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రభుత్వం నుంచి పింఛను లభిస్తుంది. ఈ పథకం మార్చి 31, 2023 తర్వాత ముగుస్తుందని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మార్చి నెలలో ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు.

పాన్‌ ఆధార్‌తో లింక్

మార్చి 31 వరకు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయండి. దీని కోసం మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే మీరు 31వ తేదీలోపు లింక్ చేయకుంటే ఆదాయపు పన్ను చెల్లించలేరు.

పన్ను ప్రణాళిక

ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేయడానికి చివరి అవకాశం ఉంది. దీని తర్వాత మీరు ఏదైనా పన్ను ఆదా పథకంలో పెట్టుబడి పెడితే దానిపై మినహాయింపు ప్రయోజనం పొందలేరు. PPF, NPS, సుకన్య సమృద్ధి వంటి అనేక పథకాలలో ఇప్పుడే డబ్బును పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

బీమా పాలసీలో పెట్టుబడి

రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం ఉన్న ఎల్‌ఐసీ పాలసీకి ఇకపై పన్ను మినహాయింపు లభించదు. ఈ మేరకు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరాలు వెల్లడించారు. ఈ నియమం 1 ఏప్రిల్ 2023 నుంచి వర్తిస్తుందని గుర్తుంచుకోండి.

మ్యూచువల్ ఫండ్ స్కీమ్

మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇంకా నామినేషన్ చేయకుంటే ఈ పనిని మార్చి 31 లోపు పూర్తి చేయాలి. దీన్ని అప్‌డేట్ చేయాల్సిందిగా ఇన్వెస్టర్లందరినీ ఫండ్ హౌస్‌లు కోరుతున్నాయి. మీరు నామినేషన్ వేయకుంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియో ఆగిపోతుంది. కాబట్టి ఈ పనిని మార్చి 31లోపు పూర్తి చేయాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories