వంద కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఎందుకు లేవు?


వంద కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఎందుకు లేవు?
ఇండియాలో కేవలం 13 నుంచి 14 కోట్ల మంది భారతీయులకు మాత్రమే కొనుగోలు శక్తి ఉందని నివేదిక తెలుపుతోంది
ఇండియాలో కేవలం 13 నుంచి 14 కోట్ల మంది భారతీయులకు మాత్రమే కొనుగోలు శక్తి ఉందని నివేదిక తెలుపుతోంది. బ్లూమే వెంచర్స్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలు వెలుగు చూశాయి.భారత్లో 143 కోట్ల జనాభా ఉంది. భారత్ జనాభాలో మెజారిటీ ప్రజలు అంటే సుమారు 100 కోట్ల మంది జనాభా తమకు అవసరమైన సరుకులు లేదా వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఈ రిపోర్టు ప్రకటించింది.
భారత్ జీడీపీ వినియోగదారుల వ్యయంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. మరో 30 కోట్ల మంది వినియోగదారులు అత్యవసర సరుకులతో పాటు ఇతర వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ, వారికి ఆర్ధిక స్తోమత కలిసి రావడం లేదు. దేశంలో మార్కెట్ విస్తరించడం లేదు అంటే సంపద కొందరి వద్దే చేరుతోంది. డబ్బు సంపాదించే వారి సంఖ్య పెరగడం లేదు.
ఈ మార్పు వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. ప్రత్యేకించి ప్రీమియర్ ఉత్పత్తుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అంటే సంపన్నులకు ఉపయోగపడే లేదా వారికి అందుబాటులో ఉండే వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఐదేళ్ల క్రితం భారత్ మార్కెట్ లో మధ్యతరగతి లేదా పేదలకు అందుబాటులో ఉన్న ఇళ్లు 40 శాతం ఉండేవి. ఇప్పుడు అవి 18 శాతానికి పడిపోయాయి.లగ్జరీ ఇళ్లు, అత్యాధునిక మొబైల్స్ మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఫోన్లు, ఇళ్లు తక్కువగా ఉన్నాయి.
10 శాతం భారతీయుల వద్ద ఎంత ఆదాయం ఉందంటే?
కరోనా తర్వాత ఇండియాలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు. దేశంలో 10 శాతం భారతీయుల వద్ద 57.7 జాతీయ ఆదాయాన్ని కలిగి ఉన్నారు. 1990లో వీరి ఆదాయం 34 శాతం ఉంది. 2025 నాటికి అది 57.7 శాతానికి చేరుకుంది. మిగిలిన జాతీయ ఆదాయాన్ని 15 శాతం మంది వద్ద ఉంది. 1990లో ఇది 22 శాతంగా ఉండింది.
ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. పొదుపు చేసే సామర్ధ్యం కూడా తగ్గి అప్పులకు కారణమైంది. దేశంలో ఆదాయ పన్ను చెల్లించే జనాభాలో 50 శాతం మంది జనాభాకు పదేళ్లుగా జీతాలు పెరగలేదు. ద్రవ్యోల్బణం కారణంగా వారి ఆదాయాలు సగానికి సగం తగ్గాయి. పెరిగన ధరలు, మధ్యతరగతి ప్రజల పొదుపును ఖాళీ చేశాయి. దేశంలోని కుటుంబాల నికర పొదుపు 50 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తూనే ఉంది. ఈ కారణంతోనే మధ్య తరగతి ప్రజలు వినియోగించుకునే వస్తువులు, సేవలకు డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పడిపోయే అవకాశం ఉందని ఈ నివేదిక సూచించింది.
ఆటోమేషన్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు కరువయ్యే అవకాశం ఉందని మార్కెలస్ నివేదిక హెచ్చరించింది. ఏఐ కారణంగా క్లరికల్, సూపర్ వైజేషన్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. 2025 ఎకనామికన్ సర్వే కూడా ఏఐ ప్రభావం గురించి ప్రస్తావించింది. ఏఐతో ఉత్పాదకత పెరగనుంది. అయితే ఇది కార్మిక, ఇంటెన్సివ్ ఆర్ధిక వ్యవస్థకు అంతరాయం కల్గించనుందని ఈ సర్వే తెలిపింది.
ఆటోమేషన్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు కరువైపోతున్నాయని మార్సెల్లస్ నివేదిక హెచ్చరించింది. AI-ఆధారిత వ్యవస్థలు క్లరికల్ మరియు సెక్రటేరియల్ పాత్రలను భర్తీ చేస్తున్నాయి మరియు తయారీలో పర్యవేక్షక ఉద్యోగాలు కూడా తగ్గుతున్నాయి.
ఎకనామిక్ సర్వే 2025 కూడా AI ప్రభావం గురించి హెచ్చరికను ప్రతిధ్వనించింది. AI ఉత్పాదకతను పెంచుతున్నప్పటికీ, ఇది భారతదేశం యొక్క కార్మిక-ఇంటెన్సివ్ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుందని సర్వే హెచ్చరించింది. AI- ఆధారిత లాభాలపై పన్ను విధించడంతోపాటు, విధానపరమైన జోక్యానికి సంబంధించిన డిమాండ్లను హడావుడిగా మార్చడం వల్ల వృద్ధిని దెబ్బతీయవచ్చని IMF హెచ్చరించింది.
సమ్మిళిత లాభాలను నిర్ధారించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మరియు విద్యాసంస్థల మధ్య సహకారాన్ని కోరుతూ, సమతుల్య విధానాన్ని కొనసాగించాలని నివేదిక కోరింది. ఉద్యోగాలపై AI ప్రభావం అనిశ్చితంగానే ఉన్నప్పటికీ, ఆత్మసంతృప్తి భారతదేశానికి ఖరీదైనదని కూడా ఇది నొక్కి చెప్పింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



