ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు దూకుడు

ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ స్కాంలో అచ్చెన్నతో పాటు నలుగురు డైరెక్టర్లను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Arun Chilukuri
Published on: 25 Jun 2020 11:26 AM IST
ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు దూకుడు
X

ఈఎస్ఐ స్కాం లో ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ స్కాంలో అచ్చెన్నతో పాటు నలుగురు డైరెక్టర్లను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని విచారించి 150 కోట్ల అక్రమాలపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. అందులో భాగంగా ముందుగా అనారోగ్యం కారణంగా హాస్పిటలో చికిత్స పొందులున్న అచ్చెన్నాయుడిని అక్కడే విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలో మూడు రోజుల పాటు గుంటూరు జీజీహెచ్ లో అచ్చంనాయుడు ని విచారించనున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రాజశేఖర్, విజయ్ కుమార్, రమేష్ తో పాటు మరొకరిని కస్టడీకీ తీసుకొనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story