మనిషి రక్తం ఎర్రగా ఎందుకుంటుందో మీకు తెలుసా ?

Arun Chilukuri
Published on: 15 Feb 2019 12:57 PM IST
మనిషి రక్తం ఎర్రగా ఎందుకుంటుందో మీకు తెలుసా ?
X

ఈ రోజుల్లో రక్తదానం యొక్క ప్రాముక్యత తెలియాన్ని వారు చాల తక్కువే, ఈ దానం ఆపదలో వున్నా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది, అయితే మీకు మనిషి రక్తం ఎర్రగా ఎందుకుంటుందో మీకు తెలుసా ? ఎందుకంటే రక్తము ద్రరూపములో ఉండే కణజాలముల సమూహము . అందులో ప్లాస్మా , ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. తెల్లరక్త కణాలు , ఎర్రరక్తకణాలు , ప్లేట్లెట్స్ అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎర్రరంగులో ఉండే రక్తకణాలు మానవ రక్తం లో ప్రతి చుక్క లో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఆ రక్త కణాలలో " హీమోగ్లోబిన్‌ " అనే వర్ణక పదార్ధమువలన రక్తానికి ఎర్ర రంగు వస్తుంది. మనము పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ ని తమలో నింపుకొని శరీర భాగాలకు అందించేవి ఎర్రరక్తకణాలు , అయితే ఇదే రక్తము వెన్నెముకలేని జీవులలో మనలో లా ఎర్రగా ఉండదు. నీలి , తెలుపు రంగులో ఉంటుంది. రక్తము రంగులో తేడా ఆ జీవుల రక్తములోని పదార్ధము వల్లనే వస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉన్నరక్తమే ఎర్రగా ఉంటుంది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story