పెళ్లి చేయడానికి వచ్చి పెళ్లి కూతురితో జంప్!

పెళ్లి చేయడానికి వచ్చి పెళ్లి కూతురితో జంప్!
x
Highlights

మన సినిమాల్లో పెళ్లి సమయంలో పెళ్లి కూతరు పీతల మీదనుంచి పారిపోవడం చూస్తుంటారం. అయితే, దానికి ఆమె ప్రియుడు బయట నుంచి వచ్చి తీసుకుపోవడమో.. ప్రియుని...

మన సినిమాల్లో పెళ్లి సమయంలో పెళ్లి కూతరు పీతల మీదనుంచి పారిపోవడం చూస్తుంటారం. అయితే, దానికి ఆమె ప్రియుడు బయట నుంచి వచ్చి తీసుకుపోవడమో.. ప్రియుని స్నేహితులు అమ్మాయికి సహకరించి మాయం చేయడమో జరుగుతుంటుంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌లో పెళ్లి చేయడానికి వచ్చిన పంతులోరు పెళ్లి పిల్లని ఎగరేసుకు పోయాడు. వివరాల్లోకి వెళితే, వినోద్ మహరాజ్‌ అనే పూజారి ఇక్కడ మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారి ఇంటికి వచ్చింది. ఆనక చక్కగా ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్‌ మహరాజ్‌ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితుడు, సదరు యువతికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పురోహితుడి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండాపోయారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories