Luxury Electric Cars: పెట్రోల్ కార్లకు గుడ్‌బై.. లగ్జరీ కార్ల మార్కెట్‌లో EVలదే హవా!

Luxury Electric Cars: భారతదేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

CR Reddy
Published on: 30 Jun 2025 4:40 PM IST
Luxury Electric Cars: పెట్రోల్ కార్లకు గుడ్‌బై.. లగ్జరీ కార్ల మార్కెట్‌లో EVలదే హవా!
X

Luxury Electric Cars: భారతదేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పుడు మన దేశంలోని ధనవంతులు పెట్రోల్-డీజిల్ కార్ల బదులు, క్లీన్ ఎనర్జీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. 2024 జనవరి నుండి మే నెలల మధ్య లగ్జరీ కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7% ఉంటే, 2025లో అదే కాలంలో ఇది ఏకంగా 11%కి పెరిగింది. అంటే, కేవలం ఒక సంవత్సరంలోనే లగ్జరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్‌లో 66% పెరుగుదల నమోదైంది.

పాత లగ్జరీ కార్ల అమ్మకాల్లో కూడా ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ బాగా పెరిగింది. 2025లో ఇప్పటివరకు అమ్ముడైన పాత లగ్జరీ కార్లలో దాదాపు 19% ఎలక్ట్రిక్ కార్లే ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సంఖ్య 5% కంటే తక్కువగా ఉంది. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఈ పెరుగుదలకు ఒక పెద్ద కారణం.

2024 జనవరి-మే మధ్య లగ్జరీ ఈవీల అమ్మకాలు 1,223 యూనిట్లు ఉండగా, 2025లో అవి 2,027 యూనిట్లకు పెరిగాయి. మొత్తం 2024లో లగ్జరీ కార్ల అమ్మకాలు దాదాపు 51,000 యూనిట్లు కాగా, 2023లో ఇది 48,000 యూనిట్లుగా ఉంది. 2025లో ఈ సంఖ్య 60,000 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. 2025లో ఇప్పటివరకు లగ్జరీ కార్ల మార్కెట్ మొత్తం 5% పెరిగితే, ఈవీ సెగ్మెంట్ మాత్రం 66% భారీ వృద్ధిని సాధించింది.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను గత రెండేళ్లుగా ఈవీ నడుపుతున్నాను. నాకు పెట్రోల్-డీజిల్ కారు లేని లోటు అస్సలు అనిపించట్లేదు" అని చెప్పారు. జనవరి నుండి మే 2025 మధ్య లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో 66% వృద్ధి నమోదైందని, మెర్సిడెస్-బెంజ్ అమ్మకాలు 73% పెరిగాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి టాక్స్, రోడ్ టాక్స్ లలో లభిస్తున్న మినహాయింపుల వల్ల ఈవీల ధరలు పెట్రోల్-డీజిల్ కార్లతో సమానంగా లేదా కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ఇదే ఇప్పుడు ప్రజలు ఈవీలను ఎక్కువగా కొనడానికి ముఖ్య కారణం.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమిళనాడులోని రాణిపేటలో 2026 ప్రారంభం నాటికి తన అతిపెద్ద విదేశీ ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లు ఉంటుంది. దీనితో పాటు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా కూడా భారతదేశంలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి.

CR Reddy

CR Reddy

Next Story