Jagan: మే 2 నుంచి ఇంటింటికి వైసీపీ

YSR Congress Party Door to Door Programme From May 2
x

Jagan: మే 2 నుంచి ఇంటింటికి వైసీపీ

Highlights

YSR Congress Party: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కీలకమైన సమావేశం నిర్వహించారు.

YSR Congress Party: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రజలను అనుసంధానించేలా నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని జగన్ సూచించారు.

దీనిపై జగన్ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. అసమ్మతి, వర్గ విభేదాలు విడనాడాలని.. మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. అలాగే మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయం సాధించాలన్నారు. మే 2 నుంచి 'ఇంటింటికి వైసీపీ' కార్యక్రమం నిర్వహించాలని జగన్‌ నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories