
Ys Jagan File Photo
YS Jagan: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికై నేటికి రెండెళ్లు. సీఎంగా తన రెండేళ్ల పాలనపై వైఎస్ జగన్ స్పందించారు.
YS Jagan: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికై నేటికి రెండెళ్లు. సీఎంగా తన రెండేళ్ల పాలనపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ సంద్భంగా సోషల్ మీడియాలో ట్విట్స్ చేశారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చుతూ వచ్చామని వెల్లడించారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.... ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు... మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని వివరించారు.
ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరు ఇచ్చిన ఈ అధికారంతో అనుక్షణం.. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని'' సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2021
ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2021

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




