దేశంలో ఆ ఆప్షన్ ఉంటె మూడురాజధానుల విషయంలో 'రిఫరెండం' కు వెళ్ళేవాళ్ళం..ఏపీ సీఎం జగన్

దేశంలో ఆ ఆప్షన్ ఉంటె మూడురాజధానుల విషయంలో రిఫరెండం కు వెళ్ళేవాళ్ళం..ఏపీ సీఎం జగన్
x
Highlights

ఏపీకి మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్తు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు కీలక అంశాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక...

ఏపీకి మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్తు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు కీలక అంశాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులపై సీఎం జగన్

లక్ష కోట్ల ఖర్చు బెట్టి మహా నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదు. దానివల్ల అదనపు ఆదాయం పక్కన పెడితే,మౌలిక సదుపాయాల కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేము. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మహా నగరాల పాత్ర ఎక్కడా? గతంలో విశాఖపట్నం రాజధాని కాదు చిన్న పట్నంలా ఉన్న సమయంలో దశాబ్దాల క్రితం స్టీల్ ప్లాంట్ తో చాలా పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు విశాఖపట్నం మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు అన్ని ఒక ప్రాంతంలో పెట్టడం కంటే అనేక ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చు. నగరాల ద్వారా ఆదాయాలు పెరుగుతాయని అనుకోవడం తప్పుడు ఆలోచన. ఒకటి రెండు మినహాయించి ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీస్ సఫలం కాలేదు. శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ పనులు మొత్తం ఒకే ప్రాంతం నుండి ఎందుకు జరగాలి. చెన్నై, హైదరాబాద్ ద్వారా రాష్ట్రం ఇప్పటికే నష్టం పోయిందని చరిత్ర చెప్తుంది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కూడా మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టాం. 1990లో గతంలో హైదరాబాద్ జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ తరహాలో అమరావతిలో కూడా చెయ్యాలని చూసారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగదు అని భావిస్తే వాటి కోసం ఎందుకు పట్టుబడుతున్నారు. అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదు. 33వే ల ఎకరాలు రైతుల నుండి తీసుకోవడం కంటే మరో ప్రాంతంలో ౫౦౦ ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టి ఉండొచ్చు.

భూ కుంభకోణంపై

సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. బినామిలు అందరూ బయటపడతారు. రాజధానిలో భూములు కొన్నవారు వేల కోట్లు సంపాదించారు. విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి సహా రాష్ట్రంలో మరో కొన్ని నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి. నేను అమరావతిని విస్మరించలేదు ఇక్కడ శాసన రాజధాని కొనసాగుతుంది. దేశంలో రెఫరెండం కాన్సెప్ట్ ఉపయోగంలో లేదు అందుకే నిపుణుల సలహా తీసుకుంటున్నాం. దేశంలో రెఫరెండం అప్షన్ ఉంటే ఈ అంశంపై రెఫరెండం కు వెళ్లే వాళ్ళం. అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజల మద్దత్తు ఉందని మాకు నమ్మకం. కేవలం ౨౯ గ్రామాలు,10 వేల మంది రైతులు అనేక కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారు కానీ, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అన్ని వికేంద్రీకరణకు మద్దత్తు ఇస్తున్నాయి. చంద్రబాబుకు మరో ఎజెండా లేదు. గత 15నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ముందే చెప్పాము. అమరావతి అంత చర్చించదగిన అంశం కాదు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన సీఎం

ఆధారాలు సమర్పించాలని డిజిపి చంద్రబాబును కోరారు. ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. మేము ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మా ఫోన్ ట్యాప్ చేశారు. ఆధారాలు కూడా సమర్పించాం.

కాంగ్రెస్, బీజేపీలపై

మాది రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ. లోక్ సభలో నాలుగవ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయ లేదు. రాష్ట్ర విభజన అనంతరం కేవలం ఎపి అభివృద్ధిపై మాత్రమే మేము దృష్టి సారించాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నాం. జాతీయ అంశాలు మాకు అంత ప్రాధాన్యత కాదు.

కేంద్రంతో సంబంధాలు

ఎపి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మా మద్దతు ఉంటుంది. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుంది. రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక ప్యాకేజి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

జిఎస్టీ మినహాయింపు లపై

కేంద్రం జిఎస్టీ చెల్లింపులలో కొంత ఆలస్యం చేసినప్పటికీ, పెద్ద ఎత్తున జిఎస్టీ చెల్లింపులు తగ్గించలేదు. కరోన నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కేంద్రo అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం సంక్షోభం నుండి బయట పడాలి అంటే అప్పులు తెచ్చుకోవడమే మార్గం. ఇప్పటికే అదనంగా అప్పులు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రజల పై పన్నుల భారం విధించలేము. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నాం.

ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్

జాతీయ విద్యా విధానంలో కూడా 6వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియంకు శ్రీకారం చుట్టారు. మేము ఇంగ్లీష్ మీడియం అమలు దిశగా అడుగులు వేశాం. జాతీయ విద్యా విధానంపై 2020 దేశంలో సమానత్వాన్ని తీసుకొస్తుంది. ఇంగ్లీష్ పై ప్రేమతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టలేదు. మాతృభాషను విస్మరించము విస్మరించే ఆలోచన కూడా లేదు. సమానత్వాన్ని తీసుకు రావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. స్థోమత ఉన్న వాళ్లు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం చదివిస్తుంటే పేద విద్యార్థులు మాత్రం ప్రాంతీయ భాషల్లో చదువుతున్నారు. ప్రయివేటు స్కూల్ నుండి వచ్చిన వారు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అధిక శాతం ఉద్యోగాలు సాధిస్తున్నారు." అని సీఎం జగన్ అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories