జిల్లాల అభివృద్ధి మండళ్ల పై సీఎం జగన్ కసరత్తు.. మంత్రి పదవులు రాని వారికి అధికారాలు...

YS Jagan: జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించే విధానం రద్దు...

Shireesha
Updated on: 18 April 2022 12:55 PM IST
YS Jagan giving Special Powers to Ex Ministers | AP Live News
X

జిల్లాల అభివృద్ధి మండళ్ల పై సీఎం జగన్ కసరత్తు.. మంత్రి పదవులు రాని వారికి అధికారాలు...

YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ పార్టీని, పరిపాలనా యంత్రాంగాన్ని సమూలంగా మార్చడంలో భాగంగా జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించే విధానాన్ని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం తీసుకురావడానికి ముఖ్యమంత్రి తన మంత్రులను వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక జిల్లాకు చెందిన మంత్రిని ఇతర జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించేవారు.

ఒక్కోసారి పరిపాలనా వ్యవహారాల్లో జిల్లాల నుంచి వచ్చిన మంత్రుల కంటే ఇన్‌ఛార్జ్ మంత్రులకే ఎక్కువ అధికారాలు ఉండేవి. జిల్లాలో పార్టీలో ఏవైనా సమస్యలు వచ్చినా ఆయా జిల్లాలను చూసుకుంటున్న మంత్రులు వాటిని పరిష్కరించేవారు. గత వారంలో జగన్ తన క్యాబినెట్‌ను రద్దు చేయడంతో గతంలో ఉన్న మంత్రులంతా తాము ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్న జిల్లాలపై అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు కొత్త మంత్రివర్గం ఏర్పడినందున, ప్రస్తుత మంత్రులకు కూడా వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తారని అంతా భావించారు.

అయితే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల నియామకాన్ని జగన్ వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు మొత్తం 25 జిల్లాలకు కేబినెట్‌లో ప్రాతినిథ్యం లభించినందున, సొంత జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రులను కోరాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఇతర జిల్లాల్లో కాకుండా తమ జిల్లాల్లో పార్టీ, పాలనాపరమైన సమస్యలను చూసుకోవాలని వారిని కోరనున్నారు. అదే సమయంలో, పార్టీ కార్యకలాపాలను నిర్వహించడానికి మంత్రి పదవులు రాని వారికి తగిన అధికారాలు ఇవ్వాలని కూడా జగన్ యోచిస్తున్నారు.

ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధి బోర్డులపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాకు చెందిన అత్యంత విశ్వసనీయ ఎమ్మెల్యేలను వాటికి చైర్మన్‌లుగా నియమిస్తారు. జిల్లా మంత్రులు, డీడీబీ ఛైర్‌పర్సన్‌ల మధ్య తలెత్తుతున్న ప్రోటోకాల్ సమస్యను పరిష్కరించడంపైనా ఆయన దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.

Shireesha

Shireesha

Next Story