Yogandra Event : విశాఖలో గిన్నీస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర ఉత్సవం

దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. యోగా విలువను గుర్తించిన అనేక దేశాల్లోనూ ఉత్సాహంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Ramya Vegirouthu
Published on: 21 Jun 2025 9:03 AM IST
Yogandra Event : విశాఖలో గిన్నీస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర ఉత్సవం
X

Yogandra Event : విశాఖలో గిన్నీస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర ఉత్సవం

Yogandra Event :దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. యోగా విలువను గుర్తించిన అనేక దేశాల్లోనూ ఉత్సాహంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా సాగుతున్న యోగాంధ్ర ఉత్సవం కనీ వినీ ఎరుగని స్థాయిలో జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ యోగా ఉత్సవంలో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ నుండి భీమిలి తీర వరకు సుమారు 26 కిలోమీటర్ల పరిధిలో, మూడేళ్లకుపైగా ఆలస్యమైన యోగాంధ్ర కార్యక్రమం, ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టించింది. ఈ వేదికపై 3 లక్షల మందికి పైగా ప్రజలు ఒకేసారి యోగాసనాలు చేశారు. ఇది అంతకు ముందు ఉన్న సూరత్‌లో 1.5 లక్షల మంది చేసిన రికార్డును అధిగమించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఈ భౌతిక స్థాయిలో, ఒకేసారి ఈ స్థాయిలో యోగా కార్యక్రమం జరగడం భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ప్రభుత్వ వర్గాలు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. విశాఖ యోగాంధ్ర, రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యానికి, సమూహ స్పూర్తికి మారుపేరుగా నిలుస్తోంది.

ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు కూడా ఒక ప్రత్యేకమైన గిన్నీస్ రికార్డు సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో, అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25,000 మంది విద్యార్థులు, 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేస్తూ అద్వితీయ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

విశాఖ యోగాంధ్ర ఘనత ఒక వైపు ప్రజల ఆరోగ్య చైతన్యాన్ని చాటగా, మరోవైపు యోగా ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story