Breaking: పృథ్వీపై వైసీపీ అధిష్టానం సీరియస్.. క్రమశిక్షణ చర్యకు వైసీపీ యోచన

Breaking: పృథ్వీపై వైసీపీ అధిష్టానం సీరియస్.. క్రమశిక్షణ చర్యకు వైసీపీ యోచన
x
Highlights

అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడిన...

అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడిన తీవ్రంగా పరిగణిస్తున్న వైసీపీ పెద్దలు పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కులాలను ప్రస్తావిస్తూ లేదా కించపరుస్తూ వైసీపీ నాయకులు మాట్లాడరాదని ఆదేశాలు జారీ చేశారు.

పృథ్వీ వ్యాఖ్యలపై తోటి నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఉద్యమం చేసేవాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులని పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కార్పొరేట్ ముసుగులో ఉన్న రైతు ఉద్యమమని రాజధాని రైతులను ఉద్దేశించి పృథ్వీ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories