ఉల్లి కోసం కొట్టుకున్న మహిళలు

ఉల్లి కోసం కొట్టుకున్న మహిళలు
x
Highlights

విజయనగరం జిల్లాలో ఉల్లిపాయల కోసం ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. జిల్లాలోని పార్వతీపురం పట్టణంలోని రైతుబజారులో ఉల్లిపాయల కోసం తెల్లవారు జాము నుండి...

విజయనగరం జిల్లాలో ఉల్లిపాయల కోసం ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. జిల్లాలోని పార్వతీపురం పట్టణంలోని రైతుబజారులో ఉల్లిపాయల కోసం తెల్లవారు జాము నుండి జనాలు బారులు తీరారు. ఉదయాన్నే రైతుబజార్ సిబ్బంది రాకముందే భారీగా ఉల్లిపాయల కోసం మహిళలు, వృద్దులు, యువకులు చేరుకున్నారు. రైతుబజార్ గేటు తీయడంతో ఒక్కసారిగా అందరూ లోపలికి ప్రవేశించారు. దీంతో తీవ్ర తోపులాటకు దారితీసింది. మహిళలు, వృద్దులు తోపులాటలో క్రిందపడి పోయారు. ఈ ఘటన ఒక్కసారిగా ముష్టి యుద్దాలకు దారితీసింది. రైతుబజార్ సిబ్బంది, పోలీసులు రంగప్రవేశం చేసి గొడవలను సద్దమణిగింపజేసారు. రద్దీ కారణంగా రైతుబజార్ సిబ్బంది రెండు కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను అందిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories